మదనపల్లె, ఆగస్టు 15: (gtvmedia)80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదనపల్లె ఇండియన్ యూనియన్ క్లబ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, టౌన్ బ్యాంక్ సీఈఓ ప్రసాద్, సీడ్స్ మల్లికార్జున నాయుడు, శేష చలపతి నాయుడు, రన్ టీవీ సిరివేలు చరణ్, డిష్ రవి తదితరులు పాల్గొన్నారు.
