మదనపల్లె, సెప్టెంబర్ 17:
మదనపల్లె మండల పరిధిలోని చిన్నప్పసముద్రం–2కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
చిన్నప్పసముద్రం ప్రాంత ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక పరిస్థితులు, ఓటర్ల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని వినతిలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మదనపల్లె AMC చైర్మన్ శివరాం, రూరల్ టీడీపీ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, జనసేన రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు, AMC డైరెక్టర్ మునిరాజు, లక్ష్మీపతి, నరసింహులు, CTM స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల విషయంలో అధికారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
