మదనపల్లె, సెప్టెంబర్ 19: మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగితా హోటల్లో శనివారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హోటల్లో మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటనా స్థలానికి చేరుకుని, కొంతసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే హోటల్లో జరిగిన ఆస్తి నష్టం ఎంత మేరకు ఉందన్నది యజమాని వెల్లడించాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

