హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల గురించి అవగాహన కార్యక్రమం
పిఓపి విగ్రహాలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని నిబంధన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డిఎస్పి బుచ్చిరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో వినాయక చవితి రానున్న సందర్భంగా పండుగ వాతావరణంలో ప్రజలందరూ వినాయక చవితిని జరుపుకోవాలని వీలైనంతవరకు మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయాలని ఆయన కోరారు . డీఎస్పీ కు మట్టి వినాయక ప్రతిమ & మొక్క అందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం.
కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్,సభ్యులు అమీన్,జావీద్,మహేష్,సైసావలి, పోలీస్ సిబ్బంది ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.
