ఘనంగా టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులకు ఘన సత్కారం

మదనపల్లి మండలం, సెప్టెంబర్ 5:
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మదనపల్లి మండలం కొత్తపల్లి-3 రంగారెడ్డి కాలనీ కొత్తఇండ్లు జెడ్పీ హైస్కూల్‌లో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

టీచర్స్ డే వేడుకల్లో స్థానిక ప్రాంత ప్రజలు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ వాతావరణంలో కార్యక్రమం కొనసాగింది.

విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *