పీలేరు– పులిచర్ల మార్గంలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని పులిచెర్ల సమీపంలో ఉదయాన్నే రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం కలకలం రేపింది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాష కథనం మేరకు.. సుమారు 50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి పులిచెర్లకు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు వెంటనే 9440729533కి సమాచారం అందించాలని బాష విజ్ఞప్తి చేశారు
