అన్నమయ్య జిల్లా, మదనపల్లె | సెప్టెంబర్ 17:
మదనపల్లె సబ్ డివిజన్లో ఐదుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:
- వన్టౌన్ సీఐ రాజారెడ్డి → ఆర్ఎస్టీఎఫ్
- సీసీఎస్ సీఐ మోహన్ → మదనపల్లె వన్టౌన్
- టూటౌన్ సీఐ మహమ్మద్ రఫీ → మదనపల్లె తాలూకా సీఐ
- తాలూకా సీఐ కళా వెంకటరమణ → బి.కొత్తకోట
- బి.కొత్తకోట సీఐ గోపాల్రెడ్డి → మదనపల్లె టూటౌన్
బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త బాధ్యతల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.
