మదనపల్లె, సెప్టెంబర్ 17:
మదనపల్లె టమాటా మార్కెట్ యార్డులో మండి యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా మాట్లాడుతూ మార్కెట్ యార్డు మార్పు, మండి యజమానులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

మార్కెట్ యార్డు అధికారులు, మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు, మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం కలిసి సమస్యలను సమీక్షించారు. రైతులకు, మండి యజమానులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు.
