News

టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి. DEO: సుబ్రహ్మణ్యంమదనపల్లి ఆగస్టు 5: (gtvmedia)2026 27 విద్యా సంవత్సరం టెన్త్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డిఈఓ కే సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని, సి, డి గ్రేడ్లు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలని, అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలను ఇన్స్పైర్లో ఎక్కువ మందిని పాల్గొనేటట్లు, ప్రాజెక్టులు తయారు చేసి సంసిద్ధత చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మనం- వనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయుల వారికి సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను ఉపాధ్యాయులను మొక్కలు నాటే మనం వనం ప్రోగ్రాం యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అటవీశాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి జి శ్రీధర్ కుమార్, రాయచోటి డైట్ ఇన్చార్జి లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .

News

ఘనంగా జరిగిన నవోదయ విద్యాలయాల వ్యవస్థాపక దినోత్సవం

మదనపల్లి ఆగస్టు 5 🙁 gtvmedia)మదనపల్లి మండలం వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నవోదయ విద్యాలయాల 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భౌతిక శాస్త్ర అధ్యాపకులు…

News

వీధి కుక్కల కాటు నివారణపై బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

మదనపల్లె, ఆగస్టు 4: (gtvmedia)సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాల నివారణ, రాబీస్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మదనపల్లెలోని బి.టి. ప్రభుత్వ…

News

సిపిఐ నాయకుల పాదయాత్రను విజయవంతం చేయండి

మదనపల్లి ఆగస్టు 4 : (gtvmedia)ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడానికి సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రను ప్రజలు విజయవంతం చేయాలని, సిపిఐ నాయకులు…

News

రెడ్డెప్ప నాయుడు కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం

మదనపల్లి, ఆగస్టు 4:( gtvmedia)మదనపల్లి పట్టణం కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రెడ్డి కాలనీలో సమావేశమైన రాటకొండ రెడ్డెప్ప నాయుడు…

News

రహదారి భద్రతే-మహారక్ష

భద్రమైన ప్రయాణమే.. జిల్లా యంత్రాంగం లక్ష్యం! మదనపల్లె (ఆగస్టు 04):( gtvmedia )రోడ్డు ప్రమాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టి, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా…

News

యువత సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి: కాంగ్రెస్ నేత ఎస్. రెడ్డీ సాహెబ్

లీడ్:ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగ యువత సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్ డిమాండ్ చేశారు. ప్రధాని…

News

GTV MEDIA SPECIAL INVESTIGATION

మదనపల్లి రాజకీయాల్లో ముగిసిన వారసత్వ శకం…? 75 ఏళ్ల ఎన్నికల చరిత్రలో మారిన నాయకత్వం – గెలిచినవారు, ఓడిపోయినవారు, రాజకీయ కుటుంబాలు, కొత్త సమీకరణాలపై సమగ్ర పరిశోధనాత్మక…

News

ఏపీటెట్ జూన్–2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఈ నెల 5 నుంచి 16 వరకు ఏపీటెట్ జూన్–2026 పరీక్షలు నాలుగు కేంద్రాలలో… పరీక్షలకు హాజరుకానున్న 5,470 మంది అభ్యర్థులు మదనపల్లి, ఆగస్టు 3: (gtvmedia)…