18 మంది లబ్ధిదారులకు రూ.19.27 లక్షల CMRF చెక్కుల పంపిణీ MLA షాజహా బాషా

మదనపల్లి, ఆగస్టు 14: (gtvmedia)ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మదనపల్లి నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ.19,27,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా శుక్రవారం పంపిణీ చేశారు.

మదనపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

కీవర్డ్స్: మదనపల్లి, CMRF, ముఖ్యమంత్రి సహాయనిధి, షాజహాన్ భాషా, చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *