మదనపల్లెలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

FSSAI లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాల తయారీపై హెచ్చరిక

మదనపల్లె, ఆగస్టు 8:( gtvmedia)మదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోనే చిప్స్‌, స్నాక్స్‌, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తున్న కేంద్రాలను అధికారులు పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా తయారీ కేంద్రాల పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, ఆహార భద్రత నిబంధనల అమలు, ప్యాకింగ్ విధానాలను అధికారులు పరిశీలించారు.

ఈ తనిఖీల్లో పలుచోట్ల FSSAI లైసెన్స్ లేకుండానే ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు.

FSSAI లైసెన్స్ తప్పనిసరి

జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ.. ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు చేపట్టే ప్రతి సంస్థ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలని సూచించారు. ఆహార తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మదనపల్లె పట్టణంలో ఆహార తయారీ, విక్రయ కేంద్రాలపై తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

#Madanapalle #FoodSafety #FSSAI #MadanapalleNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *