ఘనంగా విశ్వకర్మ భగవానునికి నివాళులు
మదనపల్లి, సెప్టెంబర్ 17:
దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని చేతివృత్తుల వారు తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) వెంకటేష్ సూచించారు.
గురువారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్ఓ వెంకటేష్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి, బీసీ సంక్షేమ అధికారి తేజస్విని తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి తేజస్వి, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ సూపరింటెండెంట్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ, భాస్కరాచారి, యుగంధర్, నాగార్జున చారి, సుభద్ర, రత్నమాచారి, రమేష్, విద్యార్థులు, వివిధ చేతివృత్తుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
