రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం

మదనపల్లె/ (gtvmedia)ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పింఛన్ అందుకున్న వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రతి నెలా సమయానికి పింఛన్ అందడం తమకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా పింఛన్ల పంపిణీ జరిగేలా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *