తండ్రిపై కుమారుడి కత్తితో దాడి

చిత్తూరు జిల్లా, ఆగస్టు 14:( gtvmedia)ఎస్‌ఆర్‌ పురం మండలం క్షీర సముద్రం గ్రామంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న తండ్రి ఆనంద్‌ (45)పై కుమారుడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సొంత అత్తపై కూడా కుమారుడు దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో క్షీర సముద్రం గ్రామంతో పాటు ఎస్‌ఆర్‌ పురం మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనకు సంబంధించిన దృశ్యం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *