మదనపల్లె, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. లబ్ధిదారులు దరఖాస్తులు చేత పట్టుకుని సచివాలయంకు వెల్లువలా వస్తున్నారు. మదనపల్లె నియోజకవర్గంలో 105 సచివాలయాలు ఉండగా తొలి రోజున సర్వర్ మోరయించడంతో తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
కానీ మంగళవారం గ్రామాలు, వార్డు సచివాలయాల్లో పింఛన్లు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు సచివాలయాలకు బారులు తీరారు.

