తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు.. 22న అంకురార్పణ
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు ఈ నెల 22న అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 22, 24వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పును గమనించి తమ తిరుమల పర్యటనను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
