మదనపల్లె, జూలై 28: మదనపల్లె తాళ్ళ సుబ్బన్న కాలనీలో వెలసిన శ్రీ మహాగణపతి దేవాలయంలో మంగళవారం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, వ్రత విధానాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. స్వామివారి దివ్య ఆశీస్సులతో సమాజంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులు మనసారా ప్రార్థించారు.
ఈ పవిత్ర వ్రత మహోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి, భక్తి విశ్వాసాలను మరింత బలపరిచిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.
